ఓల్డ్సిటీ, వెలుగు: సిటీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ రోహింగ్యాలను వెంటనే వెనక్కి పంపించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్చేసింది. బాలాపూర్, కంచన్బాగ్ ప్రాంతాల్లోని డీఆర్డీఓ, మిధాని వంటి రక్షణ సంస్థల చుట్టూ ఉన్న 26 కాలనీల్లో దాదాపు 6,993 మంది రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారన్నారు.
వీరిని వెంటనే ఖాళీ చేయించాలని శుక్రవారం పురానీ హవేలీలోని కమిషనర్ ఆఫీస్లో సీపీ సజ్జనార్ను కలిసి ఉత్సవ సమితి ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రక్షణ సంస్థల సమీపంలో అక్రమ రోహింగ్యాల ఉనికి భద్రతా పరంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
