ముగిసిన మూడో విడత పోలింగ్‌

ముగిసిన మూడో విడత పోలింగ్‌

మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్‌ నాలుగు గంటలకే ముగిసింది. ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటర్లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 116 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ రోజు ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ 61.31 శాతం.

సాయంత్ర 5 గంటల వరకు రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్‌
⇒ అసోం – 74.05
⇒ బిహార్‌ – 54.95
⇒ ఛత్తీస్‌గఢ్‌ – 64.03
⇒ గోవా – 70.96
⇒ గుజరాత్‌ – 58.81
⇒ జమ్ము కశ్మీర్‌ – 12.46
⇒ కర్ణాటక – 60.87
⇒ కేరళ – 68.62
⇒ మహారాష్ట్ర – 55.05
⇒ ఒడిశా – 57.84
⇒ త్రిపుర – 71.13
⇒ ఉత్తర్‌ప్రదేశ్‌ – 56.36
⇒ పశ్చిమ్‌ బంగ – 78.94
⇒ దాద్రానగర్‌ హవేలి – 71.43
⇒ డామన్‌ డయ్యూ – 65.34