మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 116 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ నాలుగు గంటలకే ముగిసింది. ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటర్లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 116 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ రోజు ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ 61.31 శాతం.
సాయంత్ర 5 గంటల వరకు రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్
⇒ అసోం – 74.05
⇒ బిహార్ – 54.95
⇒ ఛత్తీస్గఢ్ – 64.03
⇒ గోవా – 70.96
⇒ గుజరాత్ – 58.81
⇒ జమ్ము కశ్మీర్ – 12.46
⇒ కర్ణాటక – 60.87
⇒ కేరళ – 68.62
⇒ మహారాష్ట్ర – 55.05
⇒ ఒడిశా – 57.84
⇒ త్రిపుర – 71.13
⇒ ఉత్తర్ప్రదేశ్ – 56.36
⇒ పశ్చిమ్ బంగ – 78.94
⇒ దాద్రానగర్ హవేలి – 71.43
⇒ డామన్ డయ్యూ – 65.34