ఇకపై గాంధీలో జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు

ఇకపై గాంధీలో జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు

హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు ఇకపై గాంధీ ఆస్పత్రిలోనే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు  20 ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి  గాంధీలో జీనోమ్ సీక్వెన్వీ పరీక్షలు ప్రారంభిస్తోంది.  ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్న నేపధ్యంలో భారత ప్రభుత్వం అలర్టయి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. కరోనా వేరియంట్ల స్టడీ కోసం ఇప్పటివరకు పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపిణ తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఇక్కడే నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.