
హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిటీలోని జంక్షన్స్ దగ్గ ఉన్న బెగ్గర్స్ ను గుర్తించి షెల్టర్ హోమ్స్ కు తరలిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. యాచకుల నుంచి వివరాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు . నగరంలో పబ్లిక్ ను యాచకులు ఇబ్బందులు పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
పౌరసంఘం అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యుసిడి) విభాగం గత రెండు మూడు రోజులుగా ఈ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. ప్రధాన జంక్షన్లు, దేవాలయాలు, మసీదులు, జన సమూహ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, వైద్య పరీక్షలు చేసి జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్లకు తరలిస్తున్నారు.
ALSO READ | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇక నుంచి టిఫిన్ కూడా..
గత వారం రోజుల్లో 221 మంది బెగ్గర్స్ ను గుర్తించారు జీహెచ్ఎంసీ అధికారులు.. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారు. 19 మందిని షెల్టర్ హోమ్స్ కు తరలించారు. మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బషీర్ బాగ్, సెక్రెటిరియట్, నాంపల్లి, బేగంబజార్ తో పాటు ఇతర జంక్షన్స్ లో ఉన్న బెగ్గర్స్ ను తిరలించారు అధికారులు. బెగ్గర్స్ తో పాటు ఫుట్ పాత్ పై ఉండేవారిని తరలించే ప్రక్రియ రెగ్యులర్ గా కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.