కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్  కండువా కప్పి విజయలక్ష్మిని పార్టీలోకి  ఆహ్వానించారు. 

 విజయలక్ష్మీ తండ్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు  కూడా రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నారు. మార్చి 29న సీఎం రేవంత్ రెడ్డిన కలిసిన కేకే.. తాను 55 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నానని..తిరిగి సొంత ఇంటికి వస్తున్నట్లు  చెప్పారు.  మరో సీనియర్ నే త స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన కూతురుతోపాటు కాంగ్రెస్ లో చేరనున్నారు.

జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని  విజయలక్ష్మీ అన్నారు.