ధర్మమే విజయం సాధిస్తుంది : గిరిజామనోహర్​ బాబు

ధర్మమే విజయం సాధిస్తుంది : గిరిజామనోహర్​ బాబు

ములుగు, వెలుగు : విజయదశమి అంటేనే విజయానికి చిహ్నమని, సమాజంలో ఎల్లప్పుడు ధర్మం మాత్రమే విజయం సాధిస్తుందని రిటైర్డ్​ ప్రొఫెసర్​,  సామాజిక గన్నమరాజు గిరిజామనోహర్​ బాబు అన్నారు. ధర్మజాగరణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్​ ఆధ్వర్యంలో దసరా పురస్కరించుకొని సోమవారం ములుగులోని సాధన స్కూల్​ సమీపంలో నిర్వహించిన రావణాసురవధ కార్యక్రమానికి గిరిజనా మనోహర్​ బాబు ముఖ్య వ్యక్తగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాహితీవేత్త గిరిజామనోహర్​ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి, చెడులకు వ్యత్యాసాన్ని తెలపాలని అప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు టి.వెంకటేశ్వర్​, హరికృష్ణ, తాజోద్దీన్​, రావణాసురవధ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్​, స్వాగత నిర్మాణ కమిటీ సభ్యులు సైకం శ్రీకాంత్​ రెడ్డి, సుంకరి రవి, కనుకుల చంద్రారెడ్డి, గంగిశెట్టి శ్రీనివాస్​, బీస రమేష్, చింతనిప్పుల భిక్షపతి, సల్లగొండ పద్మాకర్​ రెడ్డి, శీలం మధు, గండ్రకోట రవీందర్​, పెట్టెం రాజు, సముద్రాల రఘు పాల్గొన్నారు.