రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం యూనివర్సిటీ ‘అచీవర్స్'’ డే కార్యక్రమాన్ని శుక్రవారం వర్సిటీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా నియామక సర్టిఫికెట్లు అందజేశారు. పీడబ్యూసీ ఏసీ డైరెక్టర్అండ్ చీఫ్ ఆపరేషన్స్ లీడర్ జీటీ కృష్ణ చైతన్య, టీసీఎస్ ప్రాంతీయ అధిపతి రిచర్డ్ కింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గీతం వీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు మాట్లాడుతూ శనివారం నిర్వహించే గీతం గ్రాడ్యుయేషన్ డేలో 2026 బ్యాచ్ ప్లేస్మెంట్స్ సాధించిన 771 మందికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. గీతం స్కూల్ఆఫ్ బిజినెస్ ఓవరాల్ 97.5 శాతం నియామకాలు సాధించిందని, అండర్ గ్రాడ్యుయేషన్ వంద శాతం, ఆర్కిటెక్చర్ 95.8 శాతం నమోదు చేసిందని తెలిపారు. వివిధ విభాగాల అధిపతులు, గీతం ప్రొఫెసర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
