సిరిసిల్లలో మహిళల ఆందోళన

సిరిసిల్లలో మహిళల ఆందోళన

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: కేటీఆర్ ఉన్నోళ్లకే ఇండ్లు ఇస్తవా.. నిరుపేదలను పట్టించుకోవా అంటూ మహిళలు ఆందోళనకు దిగారు. అర్హులకు డబుల్​ఇండ్లు దక్కడం లేదంటూ గురువారం 26వ వార్డు మహిళలు మున్సిపల్ ఆఫీసర్లను నిలదీశారు. కమిషనర్ సమ్మయ్యను ఘెరావ్ చేశారు. డ్రా పద్ధతిలో లబ్ధిదారులను సెలక్ట్ చేస్తున్నామని చెప్పి కమిషనర్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మామిడాల కావ్య మాట్లాడుతూ ‘నేను నిరుపేదరాలిని. నాకు పక్షవాతం వచ్చింది. కేటీఆర్ ద్వారా నాకు  డబుల్ బెడ్​రూమ్​ఇల్లు వస్తదని ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న. కానీ నిన్న తీసిన డ్రాలో నాకు రాలేదు. మా వార్డులో చాలామందికి ఇల్లు ఉన్నోళ్లకే వచ్చింది. నాలాంటి దిక్కుమొక్కు లేనివారికి మాత్రం రాలేదు. ఇదేం అన్యాయం. మేం కేటీఆర్ కు ఓట్లు వేయలేదా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అర్హులకే డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు ఇవ్వాలంటూ 12వ వార్డుకు చెందిన కొందరు రాస్తారోకో చేశారు.