కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కోరింది. ED దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వాద్రాకు ఒక కంపెనీతో 2008లో పెట్రోలియంపై అగ్రిమెంట్ ఉందని ఈ క్రమంలో దీనిపై విచారించేందుకు ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. కానీ వాద్రాకు బుధవారం వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో తగిన ఆధారాలను ED సమర్పించాల్సి ఉంది.