యాదాద్రిలో వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం

యాదాద్రిలో వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం

యాదాద్రి: యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహుల ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా జరిగింది. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, దేవస్థానం ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తూ.. నిర్వాహకులు, వాలంటీర్లకు సూచలు అందించారు. రేపు ఉదయం 11 గంటలకు బాలాలయంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, రాత్రి 7:30 గంటలకు పాత స్కూల్ గ్రౌండ్ లో వైభవోత్సవ కల్యాణం జరుగుతుంది.