గోవా నుంచి మద్యం సరఫరా..1568 బాటిళ్లు స్వాధీనం

గోవా నుంచి మద్యం సరఫరా..1568 బాటిళ్లు స్వాధీనం

గోవా నుంచి నాన్ డ్యూటీ మద్యం తీసుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన1568 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

రామ కోటేశ్వర రావు, మనోజ్ తేజ, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ గౌడ్ లు గత కొంత కాలంగా గోవా నుంచి అక్రమ మార్గంలో మద్యం తీసుకువచ్చి ఏపీలోని గుంటూరు, నర్సాపూర్ లో విక్రయిస్తున్నారు.
అయితే విశ్వసనీయ సమాచారం మేరకు జులై 16వ తేదీ ఆదివారం చందా నగర్ లోని పీజేఆర్ ఎన్ క్లేవ్ లో దాడులు నిర్వహించి నలుగురుని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి1568 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.