శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న నిందితుడి నుంచి ఏకంగా రూ. 1.27 కోట్ల విలువైన 2.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి నలుగురు ప్రయాణికులు జులై 12వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిందితుల వద్ద రూ.1.27 కోట్ల విలువైన 2.1 కిలోల బంగారం లభించింది. ఈ మేరకు అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.