వెనిజులాపై అమెరికా దాడి తర్వాత పరిస్థితులు రోజురోజుకూ అంతర్జాతీయంగా దిగజారుతున్నాయి. మారుతున్న పరిస్థితులతో ఇన్వెస్టర్లలో వణుకు పుడుతోంది. ఈ పరిస్థితుల కారణంగా గోల్డ్, సిల్వర్, కాపర్ వంటి విలువైన లోహాలతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కుతకుతలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ హెవెన్ మెటల్స్ భారీగా డిమాండ్ చూస్తూ పెరగటం రిటైల్ మార్కెట్లపై కూడా ప్రభావాన్ని కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ ప్రాంతంలో తాజా రిటైల్ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 7న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 6 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.66 పెరుగుదలను చూసింది. తాజా ర్యాలీతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 948గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 785గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి కూడా తన ర్యాలీని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. సరఫరా సమస్యలతో పాటుగా మరోపక్క అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే బుధవారం జనవరి 7, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరుగుదలను నమోదు చేసి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 83వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.283 వద్ద ఉంది.
