శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో సోమవారం బంగారం, విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. ఒక్కరోజే సుమారు రూ.1.17 కోట్ల విలులైన కిలో 900 గ్రాముల బంగారం పట్టుబడగా.. మొత్తం నలుగురిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొదటి కేసులో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న ప్రయణికుడి వద్ద 84.8 లక్షల విలువ చేసే 1,399 గ్రాముల బంగారన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్లో పనిచేసే ఉద్యోగి సహకారంతో బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. .
రెండవ కేసులో జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న విమానంలో రూ.31.8 లక్షల విలువ చేసే 526 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో కోటి 17 లక్షల విలువ చేసే 1.93 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. మరో కేసులో బ్యాంకాక్ నుంచి శంషాబాద్కు వచ్చిన ఇద్దరి నుంచి 62,400 విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై అధికారులు కేసు నమోదు చేశారు.