శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో .. 1.9 కిలోల గోల్డ్ పట్టివేత నలుగురు అరెస్ట్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో .. 1.9 కిలోల గోల్డ్ పట్టివేత నలుగురు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో  సోమవారం బంగారం, విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. ఒక్కరోజే సుమారు రూ.1.17 కోట్ల విలులైన కిలో 900 గ్రాముల బంగారం పట్టుబడగా.. మొత్తం నలుగురిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొదటి కేసులో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు చేరుకున్న ప్రయణికుడి వద్ద 84.8 లక్షల విలువ చేసే 1,399 గ్రాముల బంగారన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్‎లో పనిచేసే ఉద్యోగి సహకారంతో బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. .

రెండవ కేసులో జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు చేరుకున్న విమానంలో రూ.31.8 లక్షల విలువ చేసే 526 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో కోటి 17 లక్షల విలువ చేసే 1.93 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. మరో కేసులో  బ్యాంకాక్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఇద్దరి నుంచి 62,400 విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై అధికారులు కేసు నమోదు  చేశారు.