క్యాప్స్యూల్స్ రూపంలో 2 కిలోల బంగారం

క్యాప్స్యూల్స్ రూపంలో 2 కిలోల బంగారం

శంషాబాద్, వెలుగు : క్యాప్స్యూల్స్ రూపంలో గోల్డ్​ స్మగ్లింగ్  చేస్తున్న ప్రయాణికుడిని శంషా బాద్  ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. శంషాబాద్  ఎయిర్ పోర్టు నుంచి చెన్నై కి వెళ్లే ఫ్లైట్​లో ప్రయాణికుడు 6 క్యాప్స్యూల్స్​ రూపంలో బంగారం పేస్ట్  తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రెండు కిలోల బంగారం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గోల్డ్  విలువ సుమారు రూ.1.30 కోట్లు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.