
- ఎయిర్పోర్టులో ప్యాసింజర్ అరెస్ట్
శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్యాసింజర్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ ప్రైవేటు పార్ట్స్ లో బంగారాన్ని దాచి తీసుకొచ్చాడు. స్కానింగ్ లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
777 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 48 లక్షల 98 వేల 967 ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.