శంషాబాద్ ​ఎయిర్​పోర్ట్​లో రూ.2 కోట్ల విలువైన గోల్డ్​ సీజ్​

శంషాబాద్ ​ఎయిర్​పోర్ట్​లో  రూ.2 కోట్ల విలువైన గోల్డ్​ సీజ్​

బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణికుల్ని కస్టమ్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్​వచ్చిన ప్రయాణికులను శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో చెక్​ చేయగా వారి వద్ద రూ.2 కోట్ల 29 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. 

వీటిని ఒకరు లోదుస్తుల్లో దాచి, మరొకరు గోల్డ్​ క్యాప్యూల్స్​ని పురీష నాళంలో దాచి తీసుకొచ్చారు. అలా వివిధ మార్గాల్లో గోల్డ్​ స్మగ్లింగ్​చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.