బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణికుల్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్వచ్చిన ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చెక్ చేయగా వారి వద్ద రూ.2 కోట్ల 29 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.
వీటిని ఒకరు లోదుస్తుల్లో దాచి, మరొకరు గోల్డ్ క్యాప్యూల్స్ని పురీష నాళంలో దాచి తీసుకొచ్చారు. అలా వివిధ మార్గాల్లో గోల్డ్ స్మగ్లింగ్చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.