
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 2024, జూన్ 25వ తేదీ మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో అబుదబి నుండి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. అతని దగ్గర 806 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. నిందితుడు బంగారాన్ని పౌడర్ గా తయారు చేసి దానిని ఉండలుగా చేసి ప్రైవేట్ పార్ట్ లో అమర్చి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.58.8 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.