పట్టాలపై పల్టీలు కొట్టిన గూడ్స్ రైలు.. ఏడు రైళ్లు రద్దు

పట్టాలపై పల్టీలు కొట్టిన గూడ్స్ రైలు.. ఏడు రైళ్లు రద్దు

రాజస్థాన్ జైపూర్ లో 2023 జూలై 15న గూడ్స్ రైలుకు చెందిన  రెండు వ్యాగన్‌లు పట్టాలు తప్పి్ంది.  అస్లాపూర్, జోబెర్న్, హిర్నోడా స్టేషన్ల మధ్య   ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ప్రాంతం నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) జైపూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. 

పట్టాలు తప్పడం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. 7 రైళ్లను అధికారులు రద్దు చేశారు.  విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వీలైనంత త్వరగా రైలు రాకపోకలను కొనసాగించేందుకు కసరత్తు  చేస్తున్నారు.  


రద్దు చేయబడిన రైళ్ల జాబితా:- 

  • 19735 జైపూర్-మార్వార్ జంక్షన్ ఎక్స్‌ప్రెస్
  • 19736 మార్వార్ జంక్షన్-జైపూర్ ఎక్స్‌ప్రెస్
  • 22977 జైపూర్-జోధ్‌పూర్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • 22978 జోధ్‌పూర్-జైపూర్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • 09605 అజ్మీర్-జైపూర్ DEMU స్పెషల్
  • 09606 జైపూర్-అజ్మీర్ DEMU స్పెషల్