
మారుతి దర్శకత్వంలో నటుడు గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం "పక్కా కమర్షియల్". కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గ్లింప్స్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ముప్పై సెకన్ల నిడివి గల ఈ వీడియోలో శ్రీనివాస్ రెడ్డి, గోపీచంద్, సత్యరాజ్ లు కోర్టు గదిలో లాయర్ గెటప్ లో ఉండడం గమనించవచ్చు. హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకొని జూన్ 12న కర్నూలులో ఆడియో విడుదలతో పాటు ఫుల్ లెన్త్ ట్రైలర్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ వాస్ నిర్మాతగా, అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జులై 1న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా పక్కా కమర్షియల్ టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు ఇప్పటికే హామీ ఇచ్చారు.