కుత్బుల్లాపూర్: ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల కూల్చివేత

కుత్బుల్లాపూర్: ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల కూల్చివేత

కుత్బుల్లాపూర్, వెలుగు: కుత్బుల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్లు, నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.  అక్కడ  ఉంటున్నవారు అడ్డుపడడంతో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి తరలించారు. గాజులరామారం సర్వే నంబర్​49లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొందరు స్థానిక నాయకులు, కబ్జాదారులు నిరుపేదలకు అమ్మారు. 

మరికొందరు కబ్జాదారులు ఏకంగా కమర్షియల్​నిర్మాణాలు చేపట్టి, రెంట్​కు ఇచ్చారు. ఫిర్యాదులు అందడంతో కలెక్టర్​ఆదేశాల మేరకు అధికారులు సోమవారం పోలీస్ ​బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. 40కి పైగా అక్రమ నిర్మాణాలను తొలగించామని డిప్యూటీ తహసీల్దార్​సుధాకర్ తెలిపారు. ఇదే సర్వే నంబర్​లో ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని సైతం కూల్చివేయాలని స్థానికులు కోరారు.