ఇవాళ మంగళగిరికి గవర్నర్ నరసింహన్

ఇవాళ మంగళగిరికి గవర్నర్ నరసింహన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇవాళ మంగళగిరి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు సమాచారం. గవర్నర్ నరసింహన్ విజయవాడలో రేపు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. దీనికి హాజరయ్యేందుకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారని తెలుస్తోంది. దీనికి సంబందించిన భద్రత, పలు ఏర్పాట్లు పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు పూర్తి చేశారు.