ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్

ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్

ఢిల్లీలో పర్యటిస్తున్నారు గవర్నర్ తమిళి సై. ఈ రోజు ప్రధాని మోడీ, హోంమత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహంలో పాల్గొన్నారు తమిళిసై. కుశక్ రోడ్ లో జరిగిన వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. ఈరోజు మోడీ, అమిత్ షాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించిన గవర్నర్...రాష్ట్రంలో డ్రగ్స్, అవినీతి, రాజకీయ పరిస్థితులపై మోడీ అమిత్ షాలకు నివేదిక అందజేశారు. ప్రోటోకాల్ కల్పించకపోవడంపై మీడియాతో  మాట్లాడారు. అయితే ఈ నెల 11, 12 తేదీల్లో గవర్నర్ భద్రాచలం వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం, అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు.