
హైదరాబాద్, వెలుగు: దేశంలో కోర్టుల్లో పెరిగిపోతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీ, ఫ్యామిలీ మెంబర్స్ సమస్యల నుండి మొదలు అంతర్జాతీయ స్థాయి సమస్యలు కొత్త సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, స్కిల్స్ ఉన్న లా స్టూడెంట్స్ ను తీర్చిదిద్దడానికి న్యాయ విద్య పరిధి విస్తృతం కావాలన్నారు . ‘న్యాయ విద్య, పరిశోధన – కోవిడ్ సవాళ్లు’ అంశంపై ఉస్మానియా యూనివర్సిటి లా కాలేజ్ ఆధ్వర్యంలో 10 రోజుల ఆన్ లైన్ వర్క్ షాప్ ను గవర్నర్ తమిళిసై సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ మొత్తం విద్యారంగానికే సవాలు విసిరిందన్నా రు. అయితే లాక్డౌన్ స్కూళ్లు, కాలేజీలకే కానీ, చదు వులకు కాదన్నారు. ప్రతి సమస్య కొన్ని కొత్త అవకాశా లను సృష్టిస్తుందని, అలాగే కోవిడ్ సంక్షోభం కూడా విద్యా రంగంలో ఆన్ లైన్, డిజిటల్ లర్నింగ్, టీచింగ్ అవకాశాలను కల్పించిందని చెప్పారు. నేషనల్ లెవెల్ లా స్కూల్స్ కు ధీటుగా సంప్రదాయ విశ్వవిద్యాలయ లా కాలేజీలు కూడా బెస్ట్లా ఎడ్యుకేషన్ను అందించాలని పిలుపునిచ్చారు . సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, లా డిపార్ట్మెంట్ హెడ్ గాలి వినోద్ కుమార్, లా డీన్ పంత్ నాయర్, జి.బి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
ఇంటర్నల్ సెక్యూరిటీలో ఐపీఎస్లే కెప్టెన్లు: తమిళిసై
ఐపీఎస్ అధికారులు, పోలీసులు సామాన్యుల రక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు . ట్రైనింగ్ లో ఉన్న ఐదుగురు ప్రొబేషనరీ ఐపీఎస్ లతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నేరాల రూపు మారుతున్నదని, సైబర్ నేరాలు అధికమవుతున్నాయన్నారు . మోడర్న్ టెక్నాలజీలతో సైబర్ నేరాలు అరికట్టాలని, ప్రజలను మోసాల బారిన పడకుండా కాపాడాలని చెప్పారు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకో వాలని సూచించారు. దేశ అంతర్గత రక్షణలో ఐపీఎస్ లే కెప్టెన్ లు అని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపీఎస్ లు ధాత్రి రెడ్డి, రష్మి పెరుమాళ్, సుధీర్ రాంనాథ్, అశోక్ కుమార్, అక్షాంశ్ యాదవ్ తోపాటు అకాడమీ డైరెక్టర్ వి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.