కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు మూటగట్టుకోవాలి : గవర్నర్ తమిళిసై

కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు మూటగట్టుకోవాలి : గవర్నర్ తమిళిసై

దేశ ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. అందరి సముచిత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే శుభ సంవత్సరంగా 2023 నిలుస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరంలో సామాజిక రుగ్మతలపై పోరాడేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

సమాజంలో సమానత్వం, సోదరభావం, శాంతి భావన, సుస్థిరతలతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే కృతనిశ్చయంతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలని తమిళిసై ఆకాంక్షించారు. పట్టు విడవకుండా భారత్ చేసిన ప్రయత్నాల వల్లే కొవిడ్ 19పై విజయం సాధించగలిగామని గవర్నర్ గుర్తు చేశారు. జీ20 సభ్యదేశాలకు నేతృత్వం వహించే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. రానున్న సంవత్సరంలో మరెన్నో విజయాలను భారత్ మూటకట్టుకోవాలని తమిళిసై ఆకాంక్షించారు.