బడ్జెట్ ప్రసంగంలో వాస్తవాలే ఉండాలి : గవర్నర్

బడ్జెట్ ప్రసంగంలో వాస్తవాలే ఉండాలి : గవర్నర్

తెలంగాణ హైకోర్టు సూచన ప్రకారం ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంలో పలు మార్పులు చేయాలని గవర్నర్ తమిళి సై రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వాస్తవాలకు దగ్గరగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చెప్పారు. అయితే తమిళి సై సూచనలకు అనుగుణంగానే బడ్జెట్ ప్రసంగాన్ని రూపొందించనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉన్న వాస్తవాలనే ప్రసంగంలో చూపిస్తామని చెప్పారు. ఇక ఫిబ్రవరి 3న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 

అంతకుముందు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం, దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం, ప్రభుత్వం నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి చర్చలు జరపడంతో బడ్జెట్ సమావేశాలపై గవర్నర్, ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది. గవర్నర్‌తో సమావేశం అనంతరం బడ్జెట్ సమావేశాల తేదీలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.