భారత్ బలంగా ఉండటానికి రాజ్యాంగమే కారణం

భారత్ బలంగా ఉండటానికి రాజ్యాంగమే కారణం

హైదరాబాద్: రాజ్యాంగం వల్లే భారత్ బలంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఘనంగా వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. దేశం ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.