ఢిల్లీలో విద్యాసంస్థల మూసివేత

ఢిల్లీలో విద్యాసంస్థల మూసివేత

ఢిల్లీలో కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్కరోజే 7,437కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు. తదుపరి ప్రకటన చేసేవరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని స్పష్టం చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే ఢిల్లీలో ఏప్రిల్ 6 నుంచి 30వ తేదీ వరకు రాత్రివేళ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పాటిస్తున్నారు.

మరోవైపు ఎయిమ్స్, సర్ గంగారామ్ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఎయిమ్స్ లో వారం వ్యవధిలోనే 32 మంది వైద్య సిబ్బంది కరోనా బాధితుల జాబితాలో చేరగా.. గంగారామ్ ఆస్పత్రిలో 37 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.