టోక్యో పారాలింపిక్స్  విజేతలకు ఫ్రైజ్ మనీ

టోక్యో పారాలింపిక్స్  విజేతలకు ఫ్రైజ్ మనీ

టోక్యో పారాలింపిక్స్ లో మెడల్స్ గెలిచిన క్రీడాకారులను సన్మానించారు కేంద్ర మంత్రులు. సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, సహాయమంత్రి రాందాస్ అథవాలే, పారాలింపిక్స్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ లు విజేతలను సత్కరించారు. అవనీ లేఖరా, భవీనా పటేల్, మనీష్ నర్వాల్, సింగ్ రాజ్, మరియప్పన్, సుమిత్ అంతిల్, సుహాస్ యతిరాజ్ లాంటి క్రీడాకారులు సన్మానం అందుకున్నారు. సామాజిక న్యాయం సాధికారతల శాఖ నుంచి గోల్డ్ మెడల్ గెలిచినవారికి 10 లక్షలు, సిల్వర్ విజేతలకు 8 లక్షలు, బ్రాంజ్ గెలిచినవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఆ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్.