సోషల్ మీడియా నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టాలు

సోషల్ మీడియా నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టాలు

న్యూఢిల్లీ: సోషల్ మీడియా నియంత్రణ కోసం త్వరలో చట్టాలను తీసుకురానున్నట్లు బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ తెలిపారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా శక్తిమంతంగా తయారైందని, ప్రభుత్వాలను పడగొట్టే స్థాయికి ఇది చేరుకుందన్నారు. సోషల్ మీడియా ద్వారా కొన్ని శక్తులు అరాచకాన్ని సృష్టింస్తున్నాయని.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రాజ్యాంగబద్ధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ముమ్మరంగా పని చేస్తోందని చెప్పారు.