ఖైరతాబాద్, వెలుగు: మున్నూరు కాపులను బీసీ–డి నుంచిబీసీ–ఎ జాబితాలో చేర్చుతామని సీఎం రేవంత్ప్రకటించడం బాధాకరమని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే బీసీ–ఎలో 57 కులాలు ఉన్నాయని,వాటిలో చాలా వెనుక బడిన కులాలేనన్నారు.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గడప శ్రీహరి, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ బాగయ్య మాట్లాడుతూ.. ముదిరాజ్లు రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారని చెప్పారు. బీసీ–ఎ జాబితాలో ఉన్న కులాలన్నీ18 శాతం జనాభా ఉన్నవేనని, 10 శాతం మాత్రమే ఉన్న ముదిరాజ్ లను ఎట్టి పరిస్థితుల్లో బీసీ–ఎలో చేర్చొద్దని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు తమ ఓట్లు కావాలనుకుంటే వెంటనే సీఎం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు చాట్ల సదానంద్ తదితరులు పాల్గొని మాట్లాడారు.