
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ అన్నాడు. టీమిండియా ప్రస్తుతం బలహీనంగా ఉందని చెప్పాడు. ముఖ్యంగా భారత జట్టు ఎక్కువగా కోహ్లీపై ఆధారపడుతోందని..అదే ఆసీస్కు ప్లస్ పాయింట్ అవనుందన్నాడు. దీనికి తోడు టీమిండియాలో కీలక ఆటగాళ్లు పంత్, జడేజా, బుమ్రాలు గాయాలపాలయ్యారని..దీని కారణంగానే ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా సొంతం చేసుుకుంటుందని జోస్యం చెప్పాడు.
టీమిండియాలోని పిచ్లు స్పిన్ కు అనుకూలిస్తాయని..అందుకోసమే నాథన్ లియాన్తో పాటు..ఆష్టన్ అగర్ను కూడా ఆస్ట్రేలియా తుది జట్టులో ఆడించాలని ఛాపెల్ సూచించాడు. వీరిద్దరు భారత్ను ఇబ్బంది పెడతారని చెప్పాడు. గతంలో టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ఇలాగే వికెట్లు పడగొట్టాడని..ఫ్లాట్ లెగ్ బ్రేకులు బ్యాట్స్మన్కు ప్రమాదకరంగా ఉండేవన్నాడు. బాల్ మిస్ అయితే వికెట్ పడేదన్నాడు. ప్రస్తుతం జడేజా బౌలింగ్లో ఇలాగే జరుగుతోందన్నాడు.
19 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా భారత్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫి నెగ్గింది. 2004లో ఆసీస్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2015,2017,2020లో భారతే గెలిచింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు ఆడనుంది. రెండు జట్ల మధ్య మొదటి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్పూర్లో ప్రారంభం కానుంది.