తెలంగాణ జాబ్స్..గెస్ట్ లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్

తెలంగాణ జాబ్స్..గెస్ట్ లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్

2023–24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో గెస్టు లెక్చరర్ల నియామకానికి ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జులై 19వ తేదీ నుంచి జులై 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 

గెస్టు లెక్చరర్ల నోటిఫికేషన్ పై గతంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పదేళ్లుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను తొలగించి కొత్తగా  ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదంటుననారు. తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు కావాలనే తమను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.