
గుజరాత్లోని సూరత్లో సెప్టెంబర్ 28న 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి తరగతిలో కుప్పకూలిపోయి, గుండెపోటుతో మరణించింది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు గుండెపోటుతో మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటుకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది.
బాలిక రిద్ధి మేవాడ గోదాదర ప్రాంతంలో ఉన్న గీతాంజలి పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రిద్ధి మొదటి బెంచీలో కూర్చుని ఉండగా.. ఆ సమయంసో ఉపాధ్యాయురాలు పాఠం చెప్తూ కనిపించింది. ఇంతలోనే ఆ బాసిక ఒక్కసారిగా కుప్పకూలి, బెంచీపై నుంచి కిందపడింది. ఉపాధ్యాయురాలు వెంటనే ప్రిన్సిపాల్కు సమాచారం అందించడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమెను ఆసుపత్రిలో చికిత్స పొందేలోపే మరణించింది.
కూతురి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన క్లాస్రూమ్లోని టీచర్, తోటి విద్యార్థులతో సహా అందరినీ కలిచివేసింది. విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో పాఠశాల సిబ్బంది కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనూహ్య మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిద్ధి తండ్రి ముఖేష్ మేవాడా వస్త్ర వ్యాపారి. కుటుంబం సూరత్లోని గోదాదర ప్రాంతంలోని సాయిబాబా సొసైటీలో నివసిస్తోంది.
ALSO READ: యూట్యూబ్ వీడియో లింకింగ్ స్కాం: రూ.13 లక్షలు పోగొట్టుకున్న మహిళ
రాష్ట్రంలో ఇది ఏడో మరణం. అంతకుముందు, సెప్టెంబర్ 25 న, జామ్నగర్లోని ఒక తరగతిలో గర్బా డ్యాన్స్ స్టెప్పులు రిహార్సల్ చేస్తూ 19 ఏళ్ల ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. అదేవిధంగా, జునాగఢ్లోని 24 ఏళ్ల ఓ యువకుడు గార్బా నృత్యం చేస్తూ సెప్టెంబర్ 24న ఇదే విధంగా చనిపోయాడు.