నామినేషన్లు దాఖలు చేసిన గుజరాత్ సీఎం

నామినేషన్లు దాఖలు చేసిన  గుజరాత్ సీఎం

త్వరలో  రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్  నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన నామినేషన్లు దాఖలు చేశారు.  భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గుజరాత్ లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే పటేలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా, బీజేపీని ఈ సారి అయిన గద్దే దించాలని  కాంగ్రెస్, ఆప్ ప్రయత్నాలు చేస్తున్నాయి. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. గుజరాత్ ఎన్నికలకు 167 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే బీజేపీ విడుదల చేసింది.