గుజరాత్ లోని ఖేడా జిల్లా గోబ్లెజ్ గ్రామంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 8 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మంటలు ఎలా చెలరేగాయన్నది మాత్రం తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. కానీ చాలా వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక దళం, పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసు బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.