తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి

తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి

తిరుపతి: స్థానిక సబ్-జైల్ వాచ్ గార్డు రూం వద్ద తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్  లక్ష్మీ నారాయణ రెడ్డి  గా పోలీసులు గుర్తించారు. సబ్ జైలు వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది. రిలీవర్ సిద్దారెడ్డి రావడంతో బట్టలు మార్చుకునే ప్రయత్నంలో గన్ మిస్ ఫైరింగ్ జరిగినట్లు చెబుతున్నారు. తుపాకీ శబ్దం అనంతరం కుప్పకూలిన లక్ష్మీ నారాయణ రెడ్డి ని చూసి సిద్ధారెడ్డి స్థానికుల సహాయంతో వెంటనే  ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లక్ష్మినారాయణరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. జరిగిన సంఘటనపై కానిస్టేబుల్ సిద్ధారెడ్డి రాతపూర్వకంగా ఫిర్యా దు చేయడంతో తిరుపతి పశ్చిమ ప్రాంత సీఐ శివప్రసాద్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.