సలార్ రూట్లోనే గుంటూరు కారం.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

సలార్ రూట్లోనే గుంటూరు కారం.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

గుంటూరు కారం(Guntur Kaaram).. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎదురుచూపులు ఈ సినిమా కోసమే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. మహేష్, త్రివిక్రమ్ హిట్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడంతో.. గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం మేకర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు.

అందుకోసం సలార్ రూట్ ను ఫాలో అవుతున్నారట. గుంటూరు కారం జనవరి 12న థియేటర్స్ లోకి వస్తుండగా.. రాత్రి ఒంటిగంట నుండి షోస్ వేయాలని భావిస్తున్నారట. ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సలార్ విషయంలో కూడా మేకర్స్ ఇదే ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఐడియా సూపర్ గా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ షో నుండి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ డే కలక్షన్స్ పై పడింది. దీంతో రికార్డ్ లెవల్లో వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇక గుంటూరు కారం కోసం కూడా రాత్రి ఒంటిగంట నుండే షోస్ వేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాత్రి ఒంటిగంట నుండి రావనగాడి మాస్ జాతర మొదలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై గుంటూరు కారం మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.