
హిందూ పురాణాల ప్రకారం, ఆంజనేయుడు వైశాఖ దశమి తిథి రోజున జన్మించిన రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.. జ్యోతిష్యం ప్రకారం... హనుమాన్ జయంతి రోజున ( మే 22) ఈ మంత్రాలను పఠించడం వల్ల తమ జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు, సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఏయే మంత్రాలను పఠించాలి.. స్వామి వారికి ఏ పదార్దం నైవేద్యంగా సమర్పించాలో తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ రాశి వారు ఓం అంగారకాయ నమః... . ఓం సర్వ దుఃఖ హరాయ నమః’ అనే మంత్రాలను పఠించాలి. ఆంజనేయస్వామి దేవాలయంలో ఆకు పూజ చేసి.. అప్పాలను స్వామికి నివేదనగా సమర్పించాలి.
వృషభ రాశి : ఓం కపిసేనానాయక నమః అనే మంత్రాన్ని పఠిస్తూ... ఆంజనేయస్వామి దేవాలయంలో 108 ప్రదక్షణాలు చేయాలి. ఆంజనేయస్వామి కి ఆ బూందీ లడ్డూ నైవేద్యం.. వడమాలను సమర్పించాలి.
మిధున రాశి: ఓం మనోజవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఆంజనేయ స్వామికి తులసి మాల సమర్పించాలని పండితులు అంటున్నారు. ఈ రాశివారు హనుమంతునికి తులసి మాల సమర్పించి .. సింధూరాన్ని సమర్పించాలి. షోడశోపచార పూజ చేసిన తరువాత స్వామికి మోతీచూర్ లడ్డూలను ( చిన్న లడ్డూలు) నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అంజనా పుత్రుడైన హనుమంతుడు.... సుఖ సంతోషాలను ప్రసాదించి.. కష్టాలను తొలగేలా... స్వామివారు అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : ఈ రాశి వారు ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః అనే మంత్రాన్ని చదువుతూ..హనుమంతుడికి ఆకు పూజ చేయడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. పాలతో చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితం శాంతి, సంతోషాలను స్వామివారు కలుగజేస్తారని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి: ఓం పరశౌర్యవినాశన నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తరువాత హనుమంతుడిని హనుమత్ జయంతి రోజున స్వామిని సింధూరంతో పూజించి హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవాలి. ..దీనితో పాటు హనుమాన్ అష్టోత్రాన్ని పఠించాలి. జిలేబీ వంటి తీపి పదార్థాలను స్వామివారికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్న ప్రతికూల శక్తులు తొలగి... మీరు ప్రతి పనిలోనూ ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల విజయం .. పురోగతిని పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కన్య రాశి : ఈ రాశి వారు ఓం పంక్తివక్త్ర నమః అను మంత్రాన్ని చదవాలి. హనుమత్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివి.. స్వామి వారికి తీపి పదార్దాలు ( అప్పాలు ) నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని ఆశీర్వాదం లభించి మీకు అన్ని పనుల్లో విజయం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
తుల రాశి : ఈ రాశి వారు ఓం సర్వగ్రహవినాశినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కళ్లు మూసుకొని చదవాలి. ఈ రాశివారు హనుమంతునికి తులసి మాల సమర్పించి .. సింధూరాన్ని సమర్పించాలి. షోడశోపచార పూజ చేసిన తరువాత స్వామికి మోతీచూర్ లడ్డూలను ( చిన్న లడ్డూలు) నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అంజనా పుత్రుడైన హనుమంతుడు.... సుఖ సంతోషాలను ప్రసాదించి.. కష్టాలను తొలగేలా... స్వామివారు అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి ఓం సర్వబంధవిమోక్త్రే నమః .. అనే మంత్రాన్ని పఠిస్తూ ఆంజనేయస్వామికి 108 ప్రదక్షిణాలు చేయాలి.
అష్టోత్తర పూజ చేసిన తరువాత .. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. అయితే ఈ రాశుల వారు ఆంజనేయస్వామికి లడ్డూలు నివేదించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగి పురోగతి కలిగేలా స్వామి వారు అనుగ్రహిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు ఓం చిరంజీవితే నమః అనే మంత్రాన్ని చదవాలి. ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించాలి. అష్టోత్తర పూజ చేసిన తరువాత .. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. అయితే ఈ రాశుల వారు ఆంజనేయస్వామికి పులిహార నివేదించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగి పురోగతి కలిగేలా స్వామి వారు అనుగ్రహిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి : ఈ రాశివారు ఓం సురార్చితే నమః అనే మంత్రాన్ని చదవాలి. ఈ రాశి వారు ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించాలి. అష్టోత్తర పూజ చేసిన తరువాత .. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. అయితే ఈ రాశుల వారు ఆంజనేయస్వామికి లడ్డూలు నివేదించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగి పురోగతి కలిగేలా స్వామి వారు అనుగ్రహిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: ఈ రాశివారు ఓం వజ్రకాయాయ నమః అనే మంత్రాన్ని చదవాలి. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి.. ఆకుపూజ చేయాలి. 108 తమల పాకులతో దండ తయారు స్వామి వారికి సమర్పించాలి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదివి.. అష్టత్తర నామాలతో పూజ చేయాలి. ఆ తరువాత పాలతో తయారు చేసిన పదార్దాలు స్వామికి నివేదించాలి. ఇలా చేస్తే హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది.. అలాగే హనుమంతుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు.
మీన రాశి: ఈ రాశివారు ఓం కామరూపిణే నమః అనే మంత్రాన్ని చదవాలి. ఈ రాశి వారు హనుమత్ జయంతి రోజు స్వామికి లవంగాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి. వీరు ఆంజనేయ స్వామి దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందుతారని పండితులు అంటున్నారు.ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఈరాశుల వారు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు తొలగి.. సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.