OMG : అత్తను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు

OMG : అత్తను తుపాకీతో  కాల్చి చంపిన అల్లుడు

హన్మకొండ జిల్లా కేంద్రంలోని.. హన్మకొండలో ఘోరం.. కూతురిని ఇచ్చిన అత్తను.. తుపాకీతో కాల్చిచంపాడు అల్లుడు. అల్లుడికి తుపాకీ ఎక్కడిదీ అంటారా.. అతను పోలీస్ డిపార్ట్ మెంట్లో కానిస్టేబుల్. 2023, అక్టోబర 12వ తేదీ ఉదయం.. హన్మకొండలోని అత్త ఇంటికి వచ్చిన అల్లుడు ప్రసాద్.. డబ్బుల విషయంపై మాట్లాడాడు. 

ఏడాది క్రితం ఇచ్చిన నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ అత్తను కోరాడు. డబ్బుల విషయంలో కొన్ని రోజులుగా అత్తతో ఉన్న విబేధాలు.. తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే అత్తతో జరిగిన గొడవలో.. ఆవేశం ఆపుకోలేక.. తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ తో అత్తను కాల్చి చంపాడు కానిస్టేబుల్ ప్రసాద్.

అత్తపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోగా.. అత్త మాత్రం అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని.. విచారణ చేపట్టారు. 

కానిస్టేబుల్ ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని.. డబ్బుల విషయంలో వివాదం నడుస్తుందని.. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా తెలిపారు పోలీసులు.