డిసెంబర్ 3 న మంత్రి ఎర్రబెల్లికి ఫస్ట్ షో, సెంకడ్ షో చూపిస్తా : ఝాన్సీ రెడ్డి

డిసెంబర్ 3 న మంత్రి ఎర్రబెల్లికి ఫస్ట్ షో, సెంకడ్ షో చూపిస్తా :  ఝాన్సీ రెడ్డి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు  పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సవాల్ విసిరారు.  ఊసరవెల్లి దయాకర్ రావును ఒడించాకే అమెరికా వెళ్తానని సవాల్ చేశారు.  గూడూరు, ఈరవెన్ను గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న ఆమె..  కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి  ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.  2023 డిసెంబర్ 3 న దయాకర్ రావుకు ఫస్ట్ షో, సెకండ్ షో చూపిస్తానని చెప్పారు.  దళిత బందు, బీసీ బందు పేరుతో డ్రామాలు చేస్తున్న ఎర్రబెల్లికి శాశ్వత బందు ఇవ్వాలని ప్రజలను కోరారు.  

ALSO READ : సంధ్యారాణి చేరిక బీజేపీకి బలం..

పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికునిలాగా పనిచేయాలన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు భయబ్రాంతులకు గురి చేసిన భయపడవద్దని, మీకు అండగా తానున్నన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తనకు వచ్చే జీతాన్ని కూడా పాలకుర్తి నియెజక అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలుచేస్తుందని హామీ ఇచ్చారు.