మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్

మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్

మల్కాజిగిరి,వెలుగు: మహిళను వేధించిన కేసులో ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మౌలాలిలోని భరత్ నగర్ లో ఉండే పరమేశ్వర్(27) ఈసీఐఎల్ లోని ఓ షాపింగ్ మాల్ లో జాబ్ చేస్తున్నాడు. గురువారం సాయంత్రం 7:30 గంటలకు అదే ప్రాంతంలో ఉండే ఓ మహిళ(24) తో బాత్రూం విషయంలో గొడవపడ్డాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. మల్కాజిగిరి పోలీసులు పరమేశ్వర్ ని అరెస్ట్ చేసి పిటీ కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు.

తనపై కేసు పెట్టిందనే కోపంతో మరుసటి రోజు మళ్లీ ఆ మహిళ ఇంటికి వెళ్లిన పరమేశ్వర్ ఆమెను చేయిపట్టుకుని బయటికి లాగి గొడవ చేశాడు. దీంతో ఆ మహిళ మల్కాజిగిరి పోలీసులకు మరోసారి కంప్లయింట్ చేసింది. శనివారం నిందితుడు పరమేశ్వర్ ను మౌలాలిలో అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ ఐ లింగస్వామి యాదవ్ తెలిపారు.