కంట్రీ చికెన్ కో .. అవుట్‌‌‌‌లెట్ ప్రారంభం

కంట్రీ చికెన్ కో .. అవుట్‌‌‌‌లెట్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  ప్రీమియం చికెన్ బ్రాండ్ 'కంట్రీ చికెన్ కో' ఐదో  అవుట్‌‌‌‌లెట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లోని  అత్తాపూర్‌‌‌‌లో ఏర్పాటు చేసింది. ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌ను  రాష్ట్ర  వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ నాటు కోడి ఆరోగ్యకరమన్నారు. 

రుచిలో నాటు కోడికి మించినది లేదని పేర్కొన్నారు.  అత్తాపూర్‌‌‌‌తో పాటు చందానగర్, సైనిక్‌‌‌‌పురిలో మరో రెండు కొత్త స్టోర్‌‌‌‌లను ప్రారంభించామని  కంట్రీ చికెన్ ఫౌండర్ జీ సాయికేష్ గౌడ్ అన్నారు. తాము తాజా, అత్యధిక నాణ్యత గల మాంసాన్ని పంపిణీ చేస్తున్నామని వివరించారు. 

కోళ్లను గ్రామాల్లోని పెరట్లలో, ఫ్రీ రేంజ్ ఫారమ్‌‌‌‌లలో పెంచుతారన్నారు. స్టెరాయిడ్, యాంటీ  బయాటిక్ వాడటం లేదని వివరించారు. గుడ్లు, ఊరగాయలు వంటి ఉత్పత్తులు కూడా అందించనున్నట్లు‌‌‌‌ గౌడ్ తెలిపారు.