బాధతోనే పొన్నంను ఆ మాట అన్న : కేటీఆర్‌‌‌‌‌‌‌‌

బాధతోనే పొన్నంను ఆ మాట అన్న :  కేటీఆర్‌‌‌‌‌‌‌‌
  •  ఆయన అంటే నాకు గౌరవం ఉంది  

హైదరాబాద్, వెలుగు : ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌పై గౌరవం ఉంది. ఉద్యమంలో ఆయన ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా ఇద్దరం కలిసి పనిచేశాం. కానీ, ఆయన సత్య దూరమైన మాటలు మాట్లాడితే బాధతో (కూసో కూసో అని) అన్నాను”అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ‘‘సభలో సభ్యులు ఏమైనా తప్పు మాట్లాడితే మంత్రులకు సవ రించే చాన్స్​ ఉంటుంది. కడియం శ్రీహరిపై రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నాం. 

మా సభ్యులకు అడిగితే కూడా మైక్ ఇవ్వడం లేదు. అధికార సభ్యులకు మాత్రం అవకాశం ఇస్తున్నరు”అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. హుస్నాబాద్‌‌‌‌లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తవ్వడంతో పాటు ట్రయల్‌‌‌‌ రన్ కూడా పూర్తయిందని గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలు మేడిగడ్డకు పోయి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రన్నింగ్ కామెంట్రీ వద్దు : స్పీకర్

రన్నింగ్​ కామెంట్రీ చేయొద్దంటూ కేటీఆర్​కు స్పీకర్​ సూచించారు. ‘‘సీనియర్ శాసనసభ్యులు మీరు..  ఒక మంత్రి మాట్లాడేటప్పుడు  సభా గౌరవాన్ని కాపాడాల్సింది పోయి మీరే అలా అనుచిత వ్యాఖ్యలు చేసి మంత్రిని అవమానపరచడం  సమంజసం కాదు. దయచేసి ఇలాంటి రన్నింగ్ కామెంట్రీ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని అన్నారు.