శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికురాలి దగ్గర 8 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. జింబాబ్వేకు చెందిన మా కుంభ కారోల్ అనే మహిళా డ్రగ్స్ తరలిస్తుండగా గుర్తించారు. 8 కేజీల హెరాయిన్ విలువ దాదాపు 53 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు అధికారులు. హెరాయిన్ తో పాటు... నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు.