మర్పల్లి మండలంలో భారీ వర్షం

మర్పల్లి మండలంలో భారీ వర్షం
  •     పొంగిపొర్లుతున్న సిరిపురం, వీర్లపల్లి వాగులు

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వాన దాదాపు రెండున్న గంటలు దంచికొట్టింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. సిరిపురం, వీర్లపల్లి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మోమిన్ పేట వైపు వెళ్లే ఉద్యోగస్తులు, ప్రయాణికులు సిరిపురం దగ్గర ఆగి పోవాల్సి వచ్చింది.

మోమిన్ పేట నుంచి సిరిపురం, మర్పల్లి, వీర్లపల్లి, పట్లూర్ గ్రామాల్లోని స్కూళ్లకు వెళ్లిన స్టూడెంట్లు అవతలి ఒడ్డున నిలిచిపోయారు. చీకటి పడేకొద్ది వరద ఉద్ధృతి మరింత పెరిగింది. వాగులపై కల్వర్టు స్థానంలో బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.