సీబీఐ ఆఫీస్ ముందు భారీ బందోబస్త్

సీబీఐ ఆఫీస్ ముందు భారీ బందోబస్త్

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను ఈ మధ్యాహ్నం సీబీఐ ఆఫీస్ నుంచి.. సీబీఐ కోర్టుకు తీసుకెళ్లారు అధికారులు. ఈ సమయంలో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ బయట భారీ బందోబస్త్ ఏర్పాటుచేశారు. వాటర్ క్యానన్లను మోహరించారు. నిరసనకారులు, మీడియా అందరినీ ఆఫీస్ కు దూరంలోనే నిలిపివేశారు. నిరసన తెలిపేందుకు ఎవరైనా వస్తే… వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అన్నిరకాలుగానూ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.  రోప్ వేలు ఏర్పాటుచేశారు. టైట్ సెక్యూరిటీ నడుమ చిదంబరంను సీబీఐ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు.