కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘జపాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్. ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా హాజరైన హీరో నాని మాట్లాడుతూ ‘తెలుగు ఆడియెన్స్కు కార్తి బాగా దగ్గరయ్యారు. ప్రతి సినిమాకి కొత్తదనం చూపిస్తూ వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ‘జపాన్’లో షాకింగ్ గెటప్తో మన ముందుకు వస్తున్నారు. ట్రైలర్లోనే దివాళి క్రాకర్స్ వైబ్ కనిపిస్తుంది.
చాలా ప్రామిసింగ్గా ఉంది. ఇదే పాజిటివ్ ఎనర్జీతో సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు. మరో అతిథిగా హాజరైన దర్శకుడు వంశీ పైడిపల్లి మూవీ టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పారు. కార్తి మాట్లాడుతూ ‘ఇది మన కల్చర్లో ఉండిపోయే బలమైన కథ. కథ విన్నప్పుడే నాకు నేను కొత్తగా మారాలని నిర్ణయించుకున్నా. గెటప్తో పాటు వాయిస్నీ మార్చా. జపాన్ పాత్రలో స్వార్ధం ఉంటుంది. ఈ సమాజం తనకి ఏది ఇచ్చిందో అదే తిరిగి ఇచ్చే పాత్ర తనది. వినోదంతో పాటు ఆలోచింపజేసేలా ఉంటుంది. ఖైదీ చూసినప్పుడు ఎలా సర్ప్రైజ్ అయ్యారో జపాన్ చూసి కూడా అలానే సర్ప్రైజ్ అవుతారు’ అని అన్నాడు. ఇది తనకు చాలా స్పెషల్ మూవీ అంది అను ఇమ్మాన్యుయేల్. ‘జపాన్’ చిత్రం అందర్నీ అలరిస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. నటుడు సునీల్ సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.