గ్యాప్ ఉండొద్దని తెలిసింది

గ్యాప్ ఉండొద్దని తెలిసింది

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్.  వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఈనెల 24న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్వహించిన  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాని మాట్లాడుతూ ‘మంచి సినిమా చేసి ఔట్‌పుట్ చూసిన తర్వాత దాన్ని ప్రేక్షకులకు  చూపించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండకూడదని ఈ మూవీతోనే తెలిసింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.  మా అందరి కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ రిలీజ్ రోజు మీకూ తెలుస్తుంది. రాహుల్ అందర్నీ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తాడు. నిర్మాత వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గారు ఫస్ట్ సినిమానే ఇలాంటిది చేయడం హ్యాపీ.

ఈసారి క్రిస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం మనదే’ అని అన్నాడు.  ‘నటించాలని, డ్యాన్స్ చేయాలని ఎంతో మందికి ఉంటుంది. కానీ కొంతమందికే అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చినందుకు, నన్ను నమ్మి పాత్రలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్.  ఆడియెన్స్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకే ఇది  జరిగింది. అందుకే దేవుడితో పాటు ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్’ అంది సాయి పల్లవి. తన పాత్రతో కొత్త ఫీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇస్తానంది కృతిశెట్టి. ఈ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వర్క్ చేయడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పింది మడోన్నా. ‘ఒక గొప్ప చిత్రం.. వెయ్యి చిత్రాలను తీసే గొప్ప శక్తినిస్తుంది. ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే మా శ్యామ్ సింగరాయ్’ అని చెప్పాడు రాహుల్. దర్శకులు వేణు శ్రీరామ్, శైలేష్ కొలను, నిర్మాత అనిల్ సుంకర  పాల్గొన్నారు.