ఐదేళ్ల క్రితం హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాల్సిన రాజశేఖర్ కూతురు శివాని.. ఇన్నాళ్లకి ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతోంది. తేజ సజ్జ హీరోగా మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివాని ఇలా ముచ్చటించింది.
‘‘కల్కి మూవీ టైమ్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దగ్గర ఈ స్టోరీ విన్నాను. చాలా బాగుంది. పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో కచ్చితంగా చేయాలనుకున్నాను. నిర్మాత చంద్రశేఖర్ నాన్నకు పర్సనల్ జిమ్ ట్రైనర్ కావడంతో నాక్కూడా పరిచయం. దాంతో అప్రోచ్ అయ్యాను. డైరెక్టర్ ఆడిషన్ చేసి వెన్నెల పాత్రకి తీసుకున్నారు. డిఫరెంట్ లవ్స్టోరీ. ప్రతి ఇరవై నిమిషాలకో ట్విస్ట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రావాల్సిన మూవీ కోవిడ్ వల్ల ఆలస్యమై ఇప్పుడిలా ఓటీటీలో వస్తోంది. నిజానికి 2018లో ‘టూ స్టేట్స్’ రీమేక్తో నేను పరిచయమవ్వాలి. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత తమిళంలో విష్ణు విశాల్ మూవీ స్టార్ట్ అయింది. అదీ కంప్లీట్ అవలేదు. ఈలోపు ‘అద్భుతం’ మొదలైనా రిలీజ్కి రెండేళ్లు పట్టింది. బ్యాడ్ లక్, ఐరన్ లెగ్ అని ఇండస్ట్రీలోఈజీగా అనేస్తారు. ఓ టైమ్లో నాకే అలా అనిపించింది. నా సినిమాలు ఎందుకు రిలీజ్ కావట్లేదని డిప్రెషన్లోకి వెళ్లాను. ఇప్పుడీ మూవీ రిలీజవుతుండడంతో హ్యాపీ. తమిళంలో ఆర్టికల్ 15 రీమేక్, అన్బరివు చిత్రాలతో పాటు తెలుగులో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. స్టార్ కిడ్స్కి స్ట్రగుల్స్ ఏంటి అంటారు కానీ అవకాశాల కోసం అప్రోచ్ అవడం మాత్రమే ఈజీ. ఆ తర్వాత ఎవరికైనా ప్రాసెస్ ఒకటే. నేను, చెల్లి శివాత్మిక ఆడిషన్స్కి వెళ్లి రిజెక్ట్ అయిన సందర్భాలెన్నో. గ్లామర్ రోల్స్, బోల్డ్ స్క్రిప్ట్స్, చిన్న సినిమాలు లాంటివి చేస్తామో లేదో అని కొందరు అడగడానికే భయపడుతున్నారు. స్టోరీ, క్యారెక్టర్ నచ్చితే బడ్జెట్, రెమ్యునరేషన్తో సంబంధం లేకుండా నటించేందుకు రెడీ.’’